పిల్లల నుంచి పెద్దవారి వరకు డైరీ మిల్క్ చాక్లెట్లను ఇష్టంగా తింటారు. అయితే ప్రస్తుతం ఈ చాక్లెట్ చుట్టూ నెట్టింట తీవ్ర వివాదం నడుస్తోంది. ఇటీవల డైరీమిల్క్ కొన్న ఓ వ్యక్తి చాక్లెట్ చూసి కంగుతిన్నారు. అది మొత్తం బూజుపట్టి, పాడైపోయి ఉంది. వెంటనే సదరు కంపెనీని ట్యాగ్ చేస్తూ ట్విటర్లో ఫొటోలు పంచుకున్నారు. 2024 జనవరిలో తయారైన ఈ చాక్లెట్పై 12నెలల ఎక్స్పైరీ డేట్ ఉన్నా.. ఇప్పుడే ఇలా కావడం ఏంటని ప్రశ్నించారు.