విశాఖకు చేరుకున్న అతిపెద్ద లగ్జరీ నౌక!

68చూసినవారు
విశాఖకు చేరుకున్న అతిపెద్ద లగ్జరీ నౌక!
ప్రపంచంలోనే అతి పెద్దదైన ‘ది వరల్డ్’ అనే అంతర్జాతీయ క్రూయిజ్ షిప్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌కు ఆదివారం చేరుకుంది. విశాఖ పోర్టు అధికారులు ఈ షిప్పుకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దాదాపు 80 మంది ప్రయాణికులతో ఈ షిప్ విశాఖపట్నం పోర్టుకు వచ్చింది. ఈ షిప్ ఆది, సోమవారాల్లో విశాఖపట్నంలోనే ఉంటుంది. సోమవారం రాత్రికి విశాఖపట్నం నుంచి ఈ షిప్ బయలుదేరి వెళుతుంది.

సంబంధిత పోస్ట్