వైఎస్ జగన్ మేమంతా సిద్ధం అనకాపల్లి జిల్లా బస్సు యాత్రలో 19వ రోజు గోడిచర్ల నుంచి ప్రారంభమై నక్కపల్లి చేరుకున్నారు. తరువాత పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం చేరుకుని జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం నరసింగపల్లి మీదుగా సాయంత్రం 4 గంటలకు చింతపాలెం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం బయ్యవరం, కశింకోట, అనకాపల్లి బైపాస్ మీదుగా పీడనాడి గ్రామం చేరుకుని అక్కడ రాత్రి బస చేస్తారు.