జగన్ పాపం పండింది: యనమల

58చూసినవారు
జగన్ పాపం పండింది: యనమల
వైఎస్ షర్మిల, విజయమ్మ, సునీతకు ఎలాంటి హాని జరిగినా అది సీఎం జగన్‌దే బాధ్యతని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జగన్ పాపం పండిందని, అధికారం కోసం చేసిన పాపాలే నేడు శాపాలయ్యాయని మండిపడ్డారు. జగన్ కుటుంబసభ్యులే ఆయనను దొంగ అని అంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత చెల్లెళ్లకు సమాధానం చెప్పలేని వ్యక్తి.. ప్రజలకు ఏం జవాబు చెప్తాడని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్