ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్లో గురువారం భారతీయ జనతా పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రమోద్ యాదవ్పై దుండగులు పట్టపగలు కాల్పులు జరిపారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమోద్ యాదవ్ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో బీ
జేపీ టిక్కెట్పై జౌన్పూర్లోని మల్హానీ స్థానం నుంచి ధనంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్పై పోటీ చేశారు.