మన్యంమారిపల్లెలో వైకాపా నాయకుడి దాడి
వైఎస్ఆర్ జిల్లా అట్లూరు మండలం మన్యంమారిపల్లెలో చాట్ల జయన్నపై వైకాపా నాయకుడు తిరుపతిరెడ్డి సహా మరికొందరి దాడి చేశారు. పొలంలో పైపులు వేసుకునే విషయంపై జయన్న, తిరుపతిరెడ్డి మధ్య వివాదం చెలరేగింది. జయన్నపై దాడి చేయడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడు జయన్న కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు.