కడప-కర్నూలు జాతీయరహదారి పక్కన ఉన్న రావులపల్లె చెరువులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు...పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామానికి చెందిన కొప్పూరు గంగాధర్(28)ఉత్తర ప్రదేశ్లో ఓ కాంట్రాక్టర్ వద్ద వెల్డర్గా పనిచేస్తుండేవాడు. రెండు నెలలక్రితం స్వగ్రామమైన నందిమండలానికి తిరిగి వచ్చిన తరువాత గంగాధర్కు వారి తల్లిదండ్రులు కలసపాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతితో వివాహ నిశ్చితార్థం చేశారు.
అయితే సిద్దవటంలోని బంధువుల అమ్మా యిని పది రోజుల క్రితం తిరుమలకు తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు. దీంతో బంధువులలో కుటుంబ కలహాలు మొదలయ్యాయి. దీంతో జీవితంపై విరక్తి చెంది మంగళవారం ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. బుధవారం స్థానిక రావులపల్లె చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో శవాన్ని గమనించిన స్థానికులు ఎస్ఐ అరుణ్రెడ్డికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టు నిమిత్తం రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.