ఎన్‌జీటీ ఆదేశాల అమలుకు చర్యలు

81చూసినవారు
ఎన్‌జీటీ ఆదేశాల అమలుకు చర్యలు
ఘన, వ్యర్థ పదార్థాల నిర్వహణలో నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ జె. వెంకటరావు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నగరంలో విస్తతంగా పర్యటించి వివిధ పనులను పర్యవేక్షించారు. సాలిడ్‌వేస్ట్, లిక్విడ్‌ వేస్ట్, డంపింగ్‌యార్డులను సందర్శించారు. నగరంలో సేకరించిన చెత్తను తరలించే గార్భేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను తనిఖీ చేశారు.

సంబంధిత పోస్ట్