48 గంటల ముందే ప్రకటన నిలిపివేయాలి కలెక్టర్
ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలు ప్రచారం చేయరాదని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం స్పష్టం చేశారు. వార్త పత్రికలలో ఈ నెల 12, 13 తేదీలలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచురించదలచిన ప్రకటనలపై ఎంసీఎంసీ కమిటీ అనుమతి తప్పనిసరని అన్నారు.