
అమలాపురం: కోనసీమ రైల్వే ప్రాజెక్టుపై సీఎం స్పందించాలి
కోనసీమ రైల్వే ప్రాజెక్టు జేఏసీ నాయకులు శుక్రవారం అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలో సమావేశమయ్యారు. కోటిపల్లి-నరసాపురం రైల్వే పనులపై వారు సమీక్ష నిర్వహించారు. కోనసీమలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో కోటిపల్లి-నరసాపురం రైల్వే పనులు ఎప్పటికీ పూర్తవుతాయో సీఎం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కల్వకొలను బాబు, డా. రాయుడు, శ్రీరామచంద్రమూర్తి, ఎస్. శాంసన్ తదితరులు పాల్గొన్నారు.