ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలకు సహకరించాలి

79చూసినవారు
ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలకు సహకరించాలి
ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జన ఉత్సవాలు ముగిసేలా ఉత్సవ కమిటీ సభ్యులు సహకరించాలని మచిలీపట్నం డీఎస్పీ కోరారు. బుధవారం మచిలీపట్నంలోని సిరి కళ్యాణ మండపంలో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ ఉత్సవ ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్