మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత

59చూసినవారు
మరోసారి శ్రీశైలం గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరడంతో శుక్రవారం మధ్యాహ్నం డ్యామ్ ఒక్క గేటు ద్వారా జలవనరుల శాఖ అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామదాస్ మోహన్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది డ్యామ్ గేట్లను ఎత్తడం ఇది ఐదోసారి అని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్