జి. కొండూరులో టిడిపి కూటమి అభ్యర్థి ప్రచారం

73చూసినవారు
మైలవరం నియోజకవర్గంలో మరోసారి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని టిడిపి కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ కోరారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలో వసంత కృష్ణ ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎన్డీఏ కూటమికే సాధ్యమన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఆయనకు హారతులు పెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్