లోక్సభ ఎన్నికల్లో ఓటేస్తే డైమండ్ రింగ్ గిఫ్ట్గా ఇస్తామని మధ్యప్రదేశ్లోని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఓటేసిన వారు తాము ఏర్పాటు చేసిన కూపన్ బాక్సుల్లో మొబైల్ నంబర్లు, పేర్లు, ఓటర్ ఐడీతో కూడిన ఫామ్లను నింపి వేయాలని సూచించారు. లక్కీ డ్రా ద్వారా 6 వేల మందికి బహుమతులు ఇస్తామని తెలిపారు. అందులో డైమండ్ రింగ్, ల్యాప్టాప్, బైక్ సహా పలు వస్తువుల ఉన్నాయన్నారు.