తిరుమల బయలుదేరి వెళ్లిన సీఎం చంద్రబాబు

64చూసినవారు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద పలువురు టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోనున్నారు.

సంబంధిత పోస్ట్