ముగిసిన కర్నూలు అసెంబ్లీ ఈవీఎం కమిషనింగ్
![ముగిసిన కర్నూలు అసెంబ్లీ ఈవీఎం కమిషనింగ్](https://media.getlokalapp.com/cache/8b/e2/8be20856956a41ee220705407ac3926a.webp)
కర్నూలు నగరంలోని ఔట్డోర్ స్టేడియంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఈవీఎం కమిషనింగ్ ప్రక్రియ శుక్రవారం ముగిసినట్లు కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి భార్గవ తేజ అన్నారు. ఈ కమిషనింగ్ ప్రక్రియలో భాగంగా 5శాతం ఈవీఎంలలో మాక్ పోలింగ్ నిర్వహించి వెయ్యి ఓట్లు వేసి ఈవీఎంల పారదర్శకతను నిర్ధారించామని తెలిపారు. శనివారం కర్నూలు పార్లమెంట్కు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని అన్నారు.