అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి: మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోండి: మాజీ ఎమ్మెల్యే
అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ఆదుకోవాలని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి రాష్ట్ర ప్రభుత్వాన్ని గురువారం కోరారు. పత్తికొండ తుగ్గలి మద్దికెర మండలాల్లో గల పలు గ్రామాలలో అధిక వర్షాలకు టమోటా, ఉల్లి, వేరుశనగ, వరి పంటలు నీట మునిగి రైతాంగం తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు ఎకరాకు రూ. 20 వేల నష్టపరిహారాన్ని వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you