మండల కేంద్రమైన మద్దికెర కు సమీపంలో ఆదివారం టాటా ఏస్ టైరు పేలి యాక్సిడెంట్ కు గురై ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన మహిళలు మద్దికెర కు చెందినవారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ కూలి పనులు చేసుకుని జీవించేవారు. వీరంతా చిప్పగిరి మండలంలో మిరపకాయలు తెంచడానికి కూలికి వెళ్లినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.