దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది: షర్మిల

81చూసినవారు
దేశంలో బీజేపీ రాజ్యాంగం నడుస్తోంది: షర్మిల
దేశంలో భారత రాజ్యాంగం నడవటం లేదు, బీజేపీ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. ’’బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఈడీ, సీబీఐ వంటి సంస్థలను ప్రతిపక్ష పార్టీలపై ఉపయోగించి ఇబ్బందులు పెట్టాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బలపడకూడదు, ఆ పార్టీ దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకూడదన్నది బీజేపీ సర్కార్ కుట్ర. అందుకు నిరసనగా విజయవాడ ఐటీ కార్యాలయం వద్ద తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటు‘‘ అని అన్నారు.

సంబంధిత పోస్ట్