విజయసాయి రెడ్డి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: జర్నలిస్టులు

76చూసినవారు
విజయసాయి రెడ్డి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: జర్నలిస్టులు
పత్తికొండ పట్టణంలో స్థానిక నాలుగు స్తంభాల సమీపంలో ఉన్న గాంధీజీ పొట్టి శ్రీరాములు విగ్రహాల దగ్గర స్థానిక జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జర్నలిస్టుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని పత్తికొండ జర్నలిస్ట్ జేఏసీ నాయకులు సాలురంగడు, సూర్య రిపోర్టర్ మధుబాబు, ఇర్ఫాన్, పవన్, సురేశ్, రాజేశ్, నాగరాజు, గోవర్ధన్ డిమాండ్ చేశారు. బుధవారం నాలుగు స్తంభాల మండపం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

సంబంధిత పోస్ట్