గుండెపోటుతో యువకుడు మృతి

2241చూసినవారు
గుండెపోటుతో యువకుడు మృతి
గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదోనిలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణంలోని ఇంద్రనగర్ కు చెందిన మాదిగ శ్రీను (25) ఓ థియేటర్లో పనిచేసేవాడు. యధావిధిగా థియేటర్లో పనిచేస్తున్న సమయంలో ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి వచ్చి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్