Feb 10, 2025, 06:02 IST/
కల్తీ నెయ్యి కేసు.. నలుగురు నిందితులకు రిమాండ్
Feb 10, 2025, 06:02 IST
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖర్, వైష్ణవీ డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, భోలే బాబా, విపిన్ జైన్, పోమిల్ జైన్ అరెస్టు చేయగా.. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కోర్టులో వారిని హాజరు పరిచారు. వారికి పది రోజుల పాటు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీంతో వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. జైలుకు తరలించనున్నారు.