చాగలమర్రిలో వివాహిత ఆత్మహత్య
చాగలమర్రి మండలం శెట్టి వీడు గ్రామానికి చెందిన నక్క మహేశ్వరి (30) అనే వివాహిత మహిళ మతిస్తిమితం సరిగ్గా లేక బుధవారం రాత్రి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చాగలమర్రి ఎస్సై రమణయ్య తెలిపారు. తీవ్ర గాయాలైన మహేశ్వరిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక గురువారం మరణించినట్లు ఎస్ఐ వెల్లడించారు.