చెరువు భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు

85చూసినవారు
ప్యాపిలి పట్టణ సమీపంలోని నాయినెర్వు భూములు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటామని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి అన్నారు. శనివారం ప్యాపిలికి వచ్చిన ఆయన నాయిన్ చెర్వును పరిశీలించారు. అనంతరం స్థానిక టీడీపీ నాయకుల ద్వారా సమస్యను అడిగి తెలుసు కున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు యాదవ్ తొప్పెల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్