బడిఈడు పిల్లలు తప్పనిసరిగా బడిలోనే ఉండాలి

56చూసినవారు
బడిఈడు పిల్లలు తప్పనిసరిగా బడిలోనే ఉండాలని మెట్టుపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్ఎం రవీంద్రగుప్త అన్నారు. ప్యాపిలీ మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామంలో బుధవారం 'నేను బడి కిపోతా' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిన్నపరెడ్డి, రమాదేవి, శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్