సుంకులాపరమేశ్వరి అమ్మవారికి వెండి పళ్లెం విరాళం
గూడూరు మండలం కె. నాగలాపురంలో వెలసిన గ్రామ దేవత సుంకులాపరమేశ్వరిదేవి అమ్మవారికి పెంచికలపాడు గ్రామానికి చెందిన గజ్జల నడిపి సుంకన్న శుక్రవారం 197 గ్రాముల వెండి పళ్లెం విరాళమిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమ్మవారి మొక్కులో భాగంగా సుంకన్న కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ సిబ్బంది కేశవ్ కు వెండి పళ్లెం అందించి రసీదు పొందారు.