రహదారిపై మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి

50చూసినవారు
కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామంలో రహదారిపై మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని గురువారం గ్రామస్థులు కోరుతున్నారు. ఈ రహదారి గుండా కోడుమూరుకు ఆయా గ్రామాల ప్రజలు, వెల్దుర్తి మండలం ప్రజలు రాకపోకలు కొనసాగిస్తుంటారు. రహదారిపై మురుగునీరు నిలిచి తీవ్ర అసౌకర్యంగా ఉందని, ఇప్పటికైనా మురుగునీరు వెళ్లేలా అధికారుల చర్యలు తీసుకోవాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్