కోడుమూరులో 30మంది వాలంటీర్ల రాజీనామా
కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలోని సచివాలయం-1, 2 పరిధిలోని 30 మంది వాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా, స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాలను కోడుమూరు ఎంపీడీవో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా అందించడం చాలా సంతోషం ఇచ్చిందన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు కృషి చేస్తామని వారు తెలిపారు.