కౌతాళం మండల పరిధిలోని ఉరుకుంద నుంచి గుడికంబళికి వెళ్లే రహదారి ఓ వైపు గుంతలమయంగా, మరోవైపు ముళ్ళ పొదలతో ప్రమాదకరంగా తయారైంది. అరగంట పట్టే సమయం రహదారి పరిస్థితి వల్ల గంటన్నర పట్టే దుస్థితి నెలకొంది. దీంతో కొత్తగా వచ్చే వారు రాత్రి పూట గుంతలు గమనించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్అండ్ బి అధికారులు స్పందించి వెంటనే రహదారి వేయించి ఇబ్బందులు తొలగించాలని సోమవారం ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.