టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

85చూసినవారు
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి వైసిపి నాయకుల కార్యకర్తల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. వైయస్ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగిందని, అయినప్పటికీ ప్రజలు ఆదరించలేదన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ, రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రస్తుతం ఎమ్మెల్యే శాంబాబును కోరారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

సంబంధిత పోస్ట్