శ్రీశైలంలో రద్దీ.. దర్శనానికి 4 గంటలు

54చూసినవారు
శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి సోమవారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుసగా సెలవులు రావడంతో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయానికి పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్లలో కంపార్టుమెంట్లలో భక్తుల బారులు తీరారు. శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆర్జిత సేవలలో కూడా భక్తులు పాల్గొంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్