మల్లన్న దర్శనానికి బారులు తీరిన భక్తజనం

64చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. గురువారం వేసవి సెలవులు ముగుస్తుండడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈసందర్భంగా భక్తులకు ఏ లోటు రానివ్వకుండా దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు అల్పాహారం, తాగునీటి సదుపాయాన్ని కల్పించారు.

సంబంధిత పోస్ట్