వైభవంగా గిరి ప్రదక్షిణ

84చూసినవారు
శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం గిరి ప్రదక్షిణ కార్యక్రమo వైభవంగా జరిగింది. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకీలో ఊరేగింపుగా గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ గిరిప్రదక్షిణ కార్యక్రమం ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమై గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం రుద్రాక్షమఠం, విభూతిమఠాల మీదుగా రుద్రవనం చేరుకొని తిరిగి నంది మండపానికి చేరుకుంది. అర్చకులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్