జాతీయ రహదారిపై లారీ యజమాని హత్య

81చూసినవారు
జాతీయ రహదారిపై లారీ యజమాని హత్య
ప్రకాశం జిల్లా పామూరు సమీపంలో దారుణం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై లారీ యజమాని వెంకటేశ్వర్లు (50)ను గుర్తుతెలియని కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్