గిరిజన గ్రామాలకు మంచి రోజులు

58చూసినవారు
గిరిజన గ్రామాలకు మంచి రోజులు
ఎన్నో ఏళ్లుగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతున్న గిరిజన గ్రామాలకు మహర్దశ పట్టనుంది. గిరిజన రెవెన్యూ గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ పథకాన్ని త్వరలో అమల్లోకి తేనుంది. ఈ పథకాన్ని వచ్చే నెలలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. నవంబర్ నుంచి పనులు చేపట్టనున్నారు. ఈ పథకం కింద ఏపీలోని 18 జిల్లాల పరిధిలోని 878 గ్రామాలు ఎంపికయ్యాయి. ఈ పథకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో 25 రకాల అభివృద్ధి పనులు జరుగుతాయి.

సంబంధిత పోస్ట్