మహాసేన రాజేష్ షాకింగ్ నిర్ణయం

571చూసినవారు
మహాసేన రాజేష్ షాకింగ్ నిర్ణయం
టీడీపీని వీడనున్నట్లు ప్రకటించిన మహాసేన రాజేష్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ టీడీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మహాసేన రాజేష్ మాట్లాడుతూ.. ‘అందరి సూచనలు, సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఉండాలని నిర్ణయించాం. నా మీద నమ్మకం ఉంచిన చంద్రబాబుకు ధన్యవాదాలు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి. మరొక 30 ఏళ్ల పాటు టీడీపీకి సేవలందిస్తాం.’ అని అన్నారు.