కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి విమర్శించారు. సీఎం జగన్ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని.. వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. సోమవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు.