మే 13న కార్మికులు, ఉద్యోగులకు సెలవు

63541చూసినవారు
మే 13న కార్మికులు, ఉద్యోగులకు సెలవు
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13న జరగనుంది. దీంతో ఆ రోజు ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మికశాఖ కమిషనర్ శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధన ఉల్లంఘిస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవు ఇచ్చినందుకు జీతంలో ఎలాంటి కోత విధించకూడదని సూచించారు.

ట్యాగ్స్ :