వాలంటీర్లపై కీలక ప్రకటన చేసిన మంత్రి

80చూసినవారు
వాలంటీర్లపై కీలక ప్రకటన చేసిన మంత్రి
వాలంటీర్లను కొనసాగిస్తారా? లేదా తొలగిస్తారా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటీర్లను పక్కన పెట్టేసినట్టేనా అన్న ప్రశ్నకు మంత్రి పార్థసారథి స్పందించారు. 'వాలంటీర్లను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. జులై 1న పెన్షన్ల పంపిణీ బాధ్యతలను మాత్రం సచివాలయ సిబ్బందికి అప్పగించాం' అని ఆయన వెల్లడించారు.

సంబంధిత పోస్ట్