ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన

75చూసినవారు
నంద్యాల జిల్లా ఎయిడ్స్ నివారణ నియంత్రణ మండలి మార్గదర్శకంలో చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు మంగళవారం విద్యార్థులకు హెచ్ఐవి,ఎయిడ్స్, టీబి పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రుద్రవరం మండల కేంద్రములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం సమాజం లో వ్యాపించే వివిధ రకాల వ్యాధుల వల్ల రక్షణ కలిగి ఆరోగ్యమే మహాభాగ్యము అనే మాట వారిలో మంచి అలవాట్లను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో దస్తగిరి రెడ్డి, శిరీష, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్