వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు

53చూసినవారు
ఆషాడ మాసం మూడవ శనివారం సందర్భంగా శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపీశర్మ, శివ స్వామి భక్తుల చేత గోవింద నామస్మరణ, సామూహిక కుంకుమార్చన కార్య క్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ వారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్