కోవెలకుంట్లలో పిచ్చికుక్క స్వైర విహారం

80చూసినవారు
కోవెలకుంట్లలో పిచ్చికుక్క స్వైర విహారం
కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక గాంధీనగర్ లో గురువారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కాలనీలో రోడ్డుపై తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. కాలనీకి చెందిన నరసింహ, భారతిని విక్షణారహితంగా కరిచింది. బాధితులను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు. నాలుగు రోజులుగా పిచ్చికుక్క కాలనీలో స్వైర విహారం చేస్తుందని స్థానికులు వాపోయారు. ఆధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.