బండి ఆత్మకూరు మండలంలోని ఏ కోడూరు గ్రామ మాజీ సర్పంచ్ వెంకటసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సుమారు 30 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి చేరాయి. ఈ సందర్భంగా వెలుగోడు మండలంలోని వేల్పనూరు గ్రామంలో గల మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో వారు టిడిపి తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా వారికి టిడిపి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.