శ్రీశైల క్షేత్రానికి పెరిగిన భక్తుల తాకిడి

1896చూసినవారు
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణతో మార్మోగుతోంది. తెల్లవారు జామునుంచే భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళుతున్నారు. దర్శనానికి దాదాపు 2 గం. ల సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్