రేపు ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ

83చూసినవారు
రేపు ఎన్డీఏ శాసనసభా పక్ష భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో ఎన్డీఏ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హాజరయ్యే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యచరణ, చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్లి తమ పాలనను ప్రజలకు వివరించనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్