రామానాయుడుకి సంతాపం తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి
కలిగిరి మండలం సిద్ధనకొండురు గ్రామ వాస్తవ్యులు, మాజీ వింజమూరు సమితి అధ్యక్షులు, టీడీపీ సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రామానాయుడు ఆదివారం మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ వారికి సంతాపం తెలిపి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.