వలేటివారిపాలెం మండలం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి శనివారం వివిధ కేటగిరీల క్రింద రూ. 9, 42, 196 రూపాయలు ఆదాయం సమకూరిందని ఆలయ ఆఫీసర్ కేబి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. అందులో ప్రధానంగా అన్నదానం వలన రూ. 4, 78, 225, ప్రత్యేక దర్శనం ద్వారా రూ. 1, 63, 000, లడ్డు ప్రసాదం కింద రూ. 1, 78, 785, తలనీలాల ద్వారా రూ. 31, 550, విరాళాల ద్వారా రూ. 20, 116 ఇతరములు ద్వారా రూ. 70, 520 ఆదాయం సమకూరిందని తెలిపారు.