ఎమ్మెల్యేకు విరాళం అందజేసిన టిడిపి నాయకులు

75చూసినవారు
ఎమ్మెల్యేకు విరాళం అందజేసిన టిడిపి నాయకులు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం గుడ్లూరు మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడ్లూరు మండలానికి చెందిన దాతలు విజయవాడ వరద బాధితుల కోసం విరాళాలు అందజేశారు. బిజెపి, జనసేన, టిడిపి ముఖ్య నేతలు కలసికట్టుగా రూ. 24.040 నగదు అందజేశారు. ఈ నగదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తానని ఎమ్మెల్యే ఇంటూరి తెలిపారు.

సంబంధిత పోస్ట్