ఒక్క రాజధాని కూడా నిర్మించలేదు: మోదీ
AP: మూడు రాజధానులపై ప్రధాని మోదీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "3 రాజధానులు ఇస్తామని చెప్పిన జగన్ ఒక్కటి కూడా నిర్మించలేదు. 3 రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. రాజధానికి కేంద్రం రూ.15 వేల కోట్లు ఇవ్వాలని భావించింది. కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది. వైసీపీ సర్కార్ అవినీతి మాత్రమే నిర్వహించగలదు.. ఆర్థిక నిర్వహణ ఈ ప్రభుత్వానికి చేతకాదు." అని మోదీ దుయ్యబట్టారు.