పొదుపు మహిళలకు 90 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

63చూసినవారు
పొదుపు మహిళలకు 90 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
మెప్మా పరిధిలోని ఐదు పొదుపు సంఘాలకు 90 లక్షల రూపాయల చెక్కును కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. మహిళలు తమ స్వసక్తితో పైకి రావాలనే ఉద్దేశంతో వారికి అన్ని విధాలుగా సహాయం చేయడానికి ప్రభుత్వం అండగా ఉందని తెలిపారు. బ్యాంకుల నుంచి ఇచ్చే రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్