పలు ఆలయాలను సందర్శించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి

79చూసినవారు
పలు ఆలయాలను సందర్శించిన ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో కలిసి గురువారం పలు ఆలయాలను సందర్శించారు. ముందుగా నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని, ఇరుకుల పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం బుచ్చి పరిధిలోని జొన్నవాడ కామాక్షమ్మను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవోలు వారికి స్వాగతం పలికారు. ఎంపీ దంపతులు అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.

సంబంధిత పోస్ట్